Showing posts with label easter good friday related stories. Show all posts
Showing posts with label easter good friday related stories. Show all posts

March 26, 2019

యేసుక్రీస్తు బ్రతికించిన ఆ ముగ్గురు ఎవరు ? || JESUS CHRIST RAISED THE DE...

యేసుక్రీస్తు బ్రతికించిన ఆ ముగ్గురు ఎవరు???

యేసుక్రీస్తు తన మూడున్నరయేళ్ల పరిచర్యలో భాగంగా ఈ భూమ్మీద ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసాడు. స్వస్థతలను అనుగ్రహించాడు, సుమారు 40 కి పైగా అద్భుతకార్యాలు చేసాడని సువార్తలు చెబుతుండగా అంతకుమించి సువార్తల్లో పొందుపరచని మరెన్నో గొప్ప ఆశ్చర్యకార్యాలు యేసుక్రీస్తు చేసాడని యోహాను సువార్తికుడు తన సువార్తలో పేర్కొన్నాడు. ఆయన చేసిన ఆశ్చర్యకార్యల్లో గొప్ప అద్భుతం చనిపోయినవారిని బ్రతికించడం. మరణించిన ముగ్గురిని క్రీస్తు బ్రతికించగా అందులో ఇద్దరినీ చనిపోయిన వెంటనే వెళ్లి బ్రతికించాడు, మరొకర్ని చనిపోయిన నాలుగు రోజుల తరువాత కుళ్లిపోతూ దుర్గంధభరితమైన పరిస్థితిలో యేసు ఆ శవానికి కన్నీటితో ప్రార్ధించి ప్రాణం పోశాడు.

1  యాయీరు కుమార్తెను బ్రతికించాడు.

సమాజ మందిరపు అధికారి అయినా యాయీరు తన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, వచ్చి కాపాడమని క్రీస్తును ప్రాధేయపడతాడు. అతని విన్నపాన్ని అంగీకరించిన యేసు యాయీరు ఇంటికి బయలుదేరి వెళతాడు. ఆ మార్గమధ్యం లోనే రక్తస్రావం వ్యాధితో బాధపడుతున్న స్త్రీ యేసు అంగీని తాకి స్వస్థతను పొందుకుంటుంది. ఈలోగా యాయీరు ఇంటికి వెళ్లే దారిలో ఉండగానే ఆ అధికారి కూతురు చనిపోయిందని కబురు వస్తుంది, యేసు భయపడక నమ్మిక మాత్రము ఉంచుము ( మార్కు సువార్త 5:36) అంటూ అతని ఇంటికి వెళ్లి రోదిస్తున్న వారి కుటుంబాన్ని చూచి చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని పలికి..ఆ చిన్నదాని చెయ్యిపెట్టి చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అనగానే పన్నెండు సంవత్సరాల ఆ చిన్నది లేచి నడుస్తుంది. ఇది చనిపోయిన వారిని యేసు బ్రతికించిన మొదటి కార్యము (మార్కు సువార్త 5:22-43, మత్తయి సువార్త 9:18-26 , లూకా సువార్త 8:40-56)

2 విధవరాలి ఒక్కగానొక్క కుమారుడుని బ్రతికించడం

తాబోరు పర్వత సమీపంలోని నాయిని అనే ఊరిలో ఓ విధవరాలు నివసిస్తూ ఉంటుంది, ఒకరోజు ఆ విధవరాలి కుమారుడు చనిపోతాడు. ఆ ఉరి ప్రజలు అతనిని తీసుకుని సమాధి కార్యక్రమాలు నిర్వహించడానికి మోసుకుపోతుండగా యేసుక్రీస్తు అప్పుడే ఆ గ్రామంలోకి ప్రవేశిస్తాడు. వేదనకరంగా రోదిస్తున్న అతని తల్లిని చూచిన యేసు ఆమెపై కనికరపడి ఏడువవద్దని ఆ విధవరాలుని ఓదారుస్తాడు. పాడెను మోస్తున్న వారిని ఆపి, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అనగానే ఆ చిన్నవాడు పాడెపై నుండి లేచి కూర్చుని మాట్లాడటం మొదలుపెడతాడు (లూకా సువార్త 7:11-15) ఇది చనిపోయిన వారిని బ్రతికించడంలో యేసు చేసిన రెండవ అద్భుతకార్యం. 

3 మరియ మార్తల సహోదరుడైన లాజరును బ్రతికించడం

లాజరు బేతనియాకు చెందిన మరియ మార్తల సహోదరుడు. యేసుక్రీస్తుకు ఎంతో ఇష్టమైనవాడు. లాజరు రోగగ్రస్తుడై చనిపోయిన నాలుగు రోజుల తరువాత యేసు బేతనియా గ్రామం చేరుకుంటాడు. మరియ, మార్త ఇంకా యెరూషలేము, బేతనియా గ్రామాల ప్రజలు వీరితో పాటు యేసు అందరూ కలిసి లాజరు సమాధి దగ్గరకు చేరుకుంటారు. సమాధికి అడ్డుగా ఉన్న రాతిని తొలగించగా భయంకరమైన దుర్గంధం వ్యాపిస్తుంది. యేసు సమాధి ముందర కూర్చుని కన్నీళ్లు విడిచి కన్నులు పైకెత్తి తండ్రిని ప్రార్ధిస్తాడు. ఆపై లాజరూ బయటకు రమ్మని బిగ్గరకా కేక వేస్తాడు. ఆ మాటతో చనిపోయి నాలుగు రోజులక్రితం సమాధి చేయబడిన లాజరూ కాళ్లకు చేతులకు ప్రేత వస్త్రాలు, ముఖానికి రుమాలుతో బయటకు వస్తాడు. యేసు అక్కడ ఉన్న వారితో మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడని చెబుతాడు. చనిపోయిన లాజరు బ్రతకడం చూచిన యూదులలో అనేకమంది యేసుక్రీస్తునందు విశ్వాసముంచుతారు. 

యేసు తాను సిలువపై మరణించి పునరుత్తానుడయ్యే ముందు చేసిన చివరి అద్భుతకార్యము లాజరును మృత్యువు బారినుండి బ్రతికించడం. 

నమ్ముట నీవలనైతే సమస్తమూ సాధ్యమే అన్న మన తండ్రి మాటలను విశ్వసించగలిగితే తప్పక మనమూ మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుతకార్యాలు చూడగలుగుతాము, ఆమెన్.

ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి
Clik link here:  యేసుక్రీస్తు బ్రతికించిన ఆ ముగ్గురు ఎవరు ? 


ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.