October 25, 2016

వాగ్దానం చేసిన మన దేవుడు నమ్మదగిన వాడు

మోషేకు వాగ్దానం చేసిన దేవుడు, ఎన్నో ఇబ్బందుల గుండా ఇశ్రాయేలు జనాంగాన్ని కానాను దేశానికి నడిపించాడు. ఫ్రజలను కానానుకు నడిపిస్తూ ఎర్రసముద్రం దగ్గరికి వెళ్ళే దారినే చూపెట్టి ఆ మార్గంలోనే వెళ్ళమంటాడు, మోషేకు తెలుసు అటువైపు దారి లేధు అంతా సముద్రమే అని, అయినా దేవుడు నిర్దేశించాడు కాబట్టి ఆ మార్గాన్నే అనుసరించాడు, తన జనాంగాన్ని నడిపించాడు. మోషెతో వచ్చిన ప్రజలు అతన్ని ఎన్నో మాటలు, నిందలు, అవమానలతో ఇబ్బంది పెట్టారు, సణిగారు, గొణిగారు..ఐనా మోషే తన విశ్వాసాన్ని విడువలేధు దెవుణ్ణే, అడిగాడు.. మార్గం చూపమని.. ఎర్రసముద్రం రెండుగా చీల్చబడింది, ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చాడు.. దేవుడే తన వాగ్దానాన్ని నెరవేర్చి వారికి నెమ్మదిని కలుగచేశాడు.


వాగ్దానం చేసిన యేసయ్య మనం మర్చిపోయినా ఆయన తను ఇచ్చిన మాట నెరవేర్చకుండా ఉండడు..మనల్ని నడిపించు మన దేవుడు కునుకడు నిద్రపోడు..

Praise the Lord, Amen.
Watch and subscribe our HOPE Nireekshana TV YouTube Channel.

No comments:

Post a Comment

If you have any doubts, please let me know